ఏకలవ్య జయంతిని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్ ట్యాంక్బండ్ వద్ద జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘనంగా నివాళులర్పించారు. కొమరం భీం విగ్రహం సమీపంలో ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమరణ యోధుడిని స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఆదివాసి ఎరుకల సంఘం నాయకులు, తెలంగాణ జాగృతి నేతలు పాల్గొన్నారు.