అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ చేసినందుకు ఎమ్మార్పీఎస్ నాయకులు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. బుధవారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఆయన, వర్గీకరణ ద్వారానే దళితులకు రాజ్యాధికారం దక్కుతుందని తెలిపారు. మాదిగల ఎన్నో ఏళ్ల కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాకారం చేశారని ఆయన ప్రశంసించారు.