సభను తప్పుదారి పట్టిస్తున్నారు

51చూసినవారు
తెలంగాణ శాసనసభను తప్పుదారి పట్టించే విధంగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని బుధవారం పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను తాము అవమానించలేదని తెలిపారు. కొత్తగా ఎమ్మెల్యేలుగా శాసనసభలోకి వచ్చిన తమకు సభ సాంప్రదాయాలు నేర్పించకుండా బీఆర్ఎస్ సభ్యులు ఇలా చేయడం బాధాకరమని చెప్పారు. కాంగ్రెస్ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్