ఆపరేషన్ సిందూర్లో భారత సైనికులు మరణించడం బాధకరమని టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్ శుక్రవారం అన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వీర మరణం పొందిన సచిన్యాదవ్, మురళీ నాయక్కు నాయకులు ఘనంగా నివాళి అర్పించారు. యుద్ధంలో చనిపోయిన సైనికుల చిత్రపటానికి మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు.