నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ శ్రీ వాసవి సేవక్ గ్రూపులో O+ve బ్లడ్కావాలని సంప్రదించగా శుక్రవారం సాయికిరణ్ గుప్తా హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ లో బ్లడ్ డొనేట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీవాసవి సేవక్ అధ్యక్షుడు అల్లాడి మహేశ్ గుప్తా, కమిటీ సభ్యులు అతన్ని ప్రశంసించారు. ఇలాంటి సేవలకు వాసవి సేవక్ సభ్యులు ఎప్పుడూ ముందుంటారని చెప్పారు.