కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి డి. పోచంపల్లి డబుల్ బెడ్ రూమ్ సముదాయం నుండి సికింద్రాబాద్ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్ ను సోమవారం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చి ఆత్మగౌరవంతో జీవించేలా చేసిన మహానేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని అన్నారు.