కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ డివిజన్ భగత్ సింగ్ నగర్ లో శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి శుక్రవారం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ భక్తి, శాంతి, రక్షణకు మార్గం అయ్యప్ప శరణమని అన్నారు. అయ్యప్ప స్వామి కరుణా కటాక్షలతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నారు.