కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలోని మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ ఆధ్వర్యంలో భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కి సంఘీభావంగా శనివారం ఆపరేషన్ సింధూర్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు, హరీష్ రావు, మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద హాజరయ్యారు. సరిహద్దుల్లో దేశ క్షేమం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన మురళి నాయక్ కు నివాళి అర్పించారు.