వరి సాగులో రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి రావడానికి వీలు ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ, అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ రాములు నాయక్ శుక్రవారం అన్నారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖలు సంయుక్తంగా చేపట్టిన రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కోహెడలోని వార్డు కార్యాలయంలో రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు.