శంషాబాద్ డీటీఎఫ్, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో 72బ్లాక్ లేబుల్ కల్తీ మద్యం బాటిళ్లు, కారు, 2ఫోన్లను బుధవారం స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. మొత్తం విలువ 20లక్షలు. కాటేదాన్లో ఓ ఫంక్షన్కు సరఫరా సమయంలో పట్టుబడ్డ ముఠా ఢిల్లీ లేబుల్స్తో ఖరీదైన మద్యం పేరుతో కల్తీ మద్యం విక్రయిస్తుండగా బుక్ అయ్యింది. సేవించేవారు ప్రాణాలకే ప్రమాదమని అధికారులు హెచ్చరిస్తున్నారు.