T-Hubలో రమాకాంత్ వేములకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

78చూసినవారు
T-Hubలో రమాకాంత్ వేములకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం
ఘట్‌కేసర్‌కు చెందిన చైల్డ్ లెర్నింగ్ స్పెషలిస్ట్ రమాకాంత్ వేముల ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండా ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నీలోఫర్ వ్యవస్థాపకుడు అనుముల బాబూరావ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని రమాకాంత్ వేములకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు. ఈ సందర్భంగా రమాకాంత్ వేముల మాట్లాడుతూ, "తెలుగు AI బూట్ క్యాంప్‌ తన చైల్డ్ లెర్నింగ్ స్పెషలైజేషన్‌లో సాంకేతిక ఆవిష్కరణలను అన్వయించే కొత్త మార్గాలను చూపించిందన్నారు. AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా ఉపయోగించడం ద్వారా పిల్లల అభ్యాస పద్ధతులను మెరుగుపరిచే నా సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. ఈ శిక్షణ పిల్లలకు వ్యక్తిగతీకరించిన, సమర్థవంతమైన అభ్యాస అనుభవాలను అందించడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నానన్నారు. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, నికీలు గుండాకి హృదయపూర్వక ధన్యవాదాలు!" అని తెలిపారు.తరువాతి తెలుగు బూట్ క్యాంప్ జూన్ 1, 2025 నుండి ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్