కూకట్పల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రామక్రిష్ణ తాప్రె ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండా ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నీలోఫర్ వ్యవస్థాపకుడు అనుముల బాబూరావ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని రామక్రిష్ణ తాప్రెకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు. ఈ సందర్భంగా రామక్రిష్ణ తాప్రె మాట్లాడుతూ, "తెలుగు AI బూట్ క్యాంప్ నా వృత్తి జీవితంలో ఒక కొత్త మలుపును తీసుకొచ్చిందన్నారు. AI టూల్స్ను ప్రాక్టికల్గా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయన్నారు. ఈ శిక్షణ నా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తుందని నమ్ముతున్నానన్నారు. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్కు, నికీలు గుండాకి నా హృదయపూర్వక ధన్యవాదాలు!" అని తెలిపారు.తరువాతి తెలుగు బూట్ క్యాంప్ జూన్ 1వ తారీఖున మొదలవ్వనుంది.