సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేట డివిజన్లోని సీసీ నగర్ లో శుక్రవారం అధికారులు, సిబ్బంది ఇంటింటి సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించారు. వీరు ఇంటింటికీ వెళ్ళి కుటుంబసభ్యుల వివరాలు, తదితర అంశాలను అడిగి వివరాలను నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్దుల్ కలీమ్, మధుర వీరన్, మునీర్ పాల్గొన్నారు.