న్యూ బోయిన్ పల్లి పెన్షన్ లైన్ లోని శ్రీ దేవి తులకాంతమ్మ ఆలయంలో నూతనంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా బుధవారం గణపతి పూజ, పుణ్యవచనము, హోమం నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్దలతో వేదమంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమాల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, కాంగ్రెస్ నాయకులు ముప్పిడి మధుకర్ పాల్గొన్నారు.