బన్సీలాల్పేట్ డివిజన్ సత్వ నెక్లెస్ ప్రైడ్ మాల్ ఎదురుగా గురువారం కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి దిష్టిబొమ్మను దహనం చేశారు. డివిజన్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి మాట్లాడుతూ బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంకా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీ దుర్మార్గ సంస్కృతికి నిదర్శనమన్నారు. పి. గజానంద్ సాయి, సందీప్, అబ్దుల్, కలీం, ఆశీష్, మోహన్ కృష్ణ, పాల్గొన్నారు.