బోయినపల్లి: జిహెచ్ఎంసి పనితీరుపై ప్రజల అసహనం

56చూసినవారు
బోయిన్పల్లిలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల పనితీరు దారుణంగా ఉందని స్థానికులు మండిపడుతున్నారు. ఓల్డ్ బోయిన్పల్లి మల్లికార్జున కాలనీలో రోడ్లపైన ఉన్న చెత్తను ఊడ్చి జీహెచ్ఎంసీ వాహనంలో తరలించకుండా ఒక దగ్గర ఖాళీ ప్రదేశంలో వదిలేస్తున్నారని ఆరోపించారు. అలా చేయడం వల్ల ఆ ఖాళీ ప్రదేశం మొత్తం డంప్ యార్డును తలపిస్తుందని పేర్కొన్నారు. తక్షణమే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్