
సూడాన్లో ఘర్షణలు.. 57 మంది మృతి
ఆఫ్రికా దేశమైన సూడాన్లో గత రెండేళ్లగా సైన్యం పారామిలటరీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో సూడాన్ అట్టుడుకుతోంది. ఇప్పటికే ఈ ఘటనల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఎక్కువగా మంది మహిళలు, పిల్లలు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. అయితే తాజాగా జరిగిన దాడుల్లో ఎల్–ఫషెర్లో 57 మంది మృతి చెందినట్లు స్థానిక వైద్య వర్గాలు వెల్లడించాయి.