సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు వరంగా మారిందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. మారేడుపల్లికి చెందిన విఘ్నేష్ కు మంజూరైన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీని ఎమ్మేల్యే తన క్యాంపు కార్యాలయంలో సోమవారం అందజేశారు. రూ. 2. 5 లక్షల విలువ గల ఎల్ఓసీ అందజేసినట్లు పేర్కొన్నారు. అర్హులైన పేద ప్రజలు కార్పొరేట్ వైద్య సేవలను ఉచితంగా పొందేందుకు ముఖ్యమంత్రి సహాయనిదికి దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు.