హైదరాబాద్ గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ప్రారంభమైన శ్రీ వీర్ హనుమాన్ విజయయాత్ర, భక్తుల నినాదాలతో ప్యారడైస్ వద్దకు చేరుకుంది. యాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని హనుమాన్ నామస్మరణతో మారుమోగించారు. భద్రత దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించి, ట్రాఫిక్ నియంత్రణతో పాటు శాంతి భద్రతలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.