
భారత నగరాలు, మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులు: విక్రమ్ మిస్రీ
భారత నగరాలు, మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులకు పాల్పడిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి ఢిల్లీలో శుక్రవారం విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. LOC వెంబడి పాకిస్తాన్ ఆర్మీ నిరంతరం కాల్పులు జరుపుతోందని ఆయన అన్నారు. లేహ్ నుంచి సర్ క్రిక్ వరకు 36 చోట్ల పాకిస్తాన్ దాడులు చేసిందని విక్రమ్ మిస్రీ తెలిపారు.