తాహసిల్దార్ కార్యాలయ ఆవరణలో గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తహసిల్దార్ అశోక్ కుమార్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు అర్హులై వివరాలు అప్డేట్ కాని ప్రజలు తమ దరఖాస్తు అందజేయవచ్చు అని పేర్కొన్నారు. తాహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద దరఖాస్తులు అందజేసినట్లయితే వారి వివరాలు అప్డేట్ చేస్తామని తెలిపారు.