బేగంపేట్ లోని మహాత్మ జ్యోతీబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 494 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణి ప్రత్యేకాధికారినణీ దివ్య, ఇతర అధికారులు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.