కొండపోచమ్మ సాగర్ లో గల్లంతైన హైదరాబాద్ యువకుల ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. సుమారు 3 గంటల పాటు గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. మొదటగా దినేశ్వర్ మృతదేహం లభించింది. తర్వాత లోహిత్, ధనుష్, జతిన్, శ్రీనివాస్ మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.