తార్నాక డివిజన్ లోని సాయి నగర్ కాలనీకి చెందిన మాధురి పార్థీవ దేహానికి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ. తనకు అత్యంత అప్తురాలు, పార్టీ కోసం పని చేసిన గొప్ప వ్యక్తి దూరమవడం బాధాకరంగా ఉందన్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆత్మీయ వ్యక్తిగా తనకి మంచి అనుబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు.