హైదరాబాద్ నాచారంలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ, మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రీపాదరావు ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ట్యాంక్ బండ్ పై విగ్రహం ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరారు.