ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లోని మందుల బస్తి స్మశాన వాటిక అభివృద్ధి కొరకు రూ. 50 లక్షల నిధులతో, ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, జిహెచ్ఎంసి ఏఈ ఆశతో కలిసి పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో స్మశాన వాటిక అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని, వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నట్టు తెలిపారు.