Top 10 viral news 🔥

అన్ని రాష్ట్రాల సీఎస్లకు కేంద్ర హోంశాఖ లేఖ
భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల సీఎస్లకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. 1968 సివిల్ డిఫెన్స్ చట్టంలోని రూల్ 11 ఉపయోగించాలని లేఖలో పేర్కొంది. రూల్ 11 ప్రకారం సైరన్ వంటి అత్యవసర పరికరాలు కొనేందుకు అధికారం ఉంటుందని తెలిపింది. అవసరమైతే అత్యవసర అధికారాలు ఉపయోగించుకోవాలని లేఖలో వెల్లడించింది.