సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి వైఎంసీఏ వరకు యూనిసెఫ్ ఆధ్వర్యంలో నీలి గొడుగు దినోత్సవం సందర్భంగా ర్యాలీ జరిగింది. బాలురిపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఉత్తర మండల అదనపు డీసీపీ అశోక్ మాట్లాడుతూ. 52% మైనర్ బాలురు లైంగిక దాడులకు గురవుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు అవసరమన్నారు.