సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో రూ. 303.62 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అనుమతిస్తూ శుక్రవారం రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్య దర్శి ఎం. దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ లో ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట్ సమీపంలో రాజీవ్ రహదారిలో ఓఆర్ఆర్ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరగనుంది. నిర్మాణానికి రక్షణ శాఖకు చెందిన 24 ఎకరాలు అవసరం కాగా ఈ మేరకు చర్యలు చేపట్టారు.