సికింద్రబాద్: ఎర్ర చెరువు వద్ద అక్రమ గుడిసెల తొలగింపు

76చూసినవారు
ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని డిప్యూటి మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి హెచ్చరించారు. శనివారం తార్నాక ఎర్ర చెరువు వద్ద పలువురు అక్రమంగా గుడిసెలు నిర్మించారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ మేయర్ ఓయూ పోలీసులతో కలిసి శనివారం ఆయా ప్రాంతాలను పరిశీలించారు. అక్రమంగా నిర్మించిన గుడిసెలను క్లియర్ చేయించారు. కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ మేయర్ ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్