సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించాలంటూ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ విద్యార్థులు రోడ్డుపై బుధవారం రాస్తారోకోకు దిగారు. 75% హాజరు లేదంటూ పరీక్ష ఫీజు ఉన్న సైతం స్వీకరించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పరీక్ష ఫీజును స్వీకరించి, పరీక్షలకు రాసేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నినదించారు.