కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి, పోలీసు ఉద్యమకారుడు బోర్గి సంజీవ్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్, బీజేపీ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని అనుసరించి ముందుకు వెళ్లాలని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కానాజిగూడలో అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని సోమవారం విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు చేశారు.