సికింద్రాబాద్ పీజీ కాలేజీ ఎదుట
విద్యార్థులు శనివారం ఆందోళన చేపట్టారు.
పరీక్షలు వాయిదా వేయాలని నినాదాలు చేశారు. రెండు సెమిస్టర్లకు కనీసం మూడు నెలలైనా వ్యవధి ఉండాలని డిమాండ్ చేశారు. మంచి ర్యాంకులు సాధించిన వారు కూడా ఈ విధానం వల్ల ఫెయిల్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీపీ గోపాలకృష్ణ విద్యార్థులను శాంతింపజేశారు.