సచివాలయం వద్ద యూనివర్సిటీల పార్ట్ టైం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. జీవో 21 రద్దు చేయాలనే డిమాండ్తో వివిధ యూనివర్సిటీల పార్ట్టైమ్ ఉద్యోగులు సచివాలయ ముట్టడికి యత్నించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేపట్టాలని.. లేకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ క్రమంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.