ఫార్ములా -ఈ కేసులో కేటీఆర్ విచారణ ముగిసింది. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లంచ్ బ్రేక్ మినహా ఏడు గంటల పాటు ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసిన సమాచారం ఇచ్చాను. రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలను తిప్పితిప్పి 40 రకాలుగా ప్రశ్నించారు అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ధ్వజమెత్తారు.