తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన తమకు లేదని, రేవంత్ రెడ్డే ఐదేళ్లు అధికారంలో ఉండాలని గురువారం మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. బంగ్లాదేశ్లో లాగా రాష్ట్ర ప్రజలే రోడ్డెక్కి ప్రభుత్వాన్ని తొక్కుతారని అన్నారు. పెద్ద పెద్ద నియంతలే కొట్టుకుపోయారని, రేవంత్ ఎంత అని చెప్పుకొచ్చారు. 'ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం.. మా వద్దకు కూడా ప్రజలు వచ్చి ప్రభుత్వాన్ని కూల్చేయాలని చెప్తున్నారు' అని కేటీఆర్ తెలిపారు.