
పాక్లో అత్యవసర పరిస్థితి.. పనిచేయని ఇంటర్నెట్
భారత్ దాడుల ప్రభావంతో పాకిస్థాన్లో అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. నిన్న రాత్రి భారత్ చేపట్టిన సైనిక చర్యల వివరాలను ఇవాళ పాక్ అధికారికంగా వెల్లడించనుంది. మరోవైపు, పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు వెలువడుతున్నాయి. దేశం మొత్తం అప్రమత్తత వాతావరణంలోకి చేరింది.