ఓయూ ఆర్ట్స్ కళాశాలలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జెఎసి స్టేట్ ప్రెసిడెంట్ వలిగొండ నర్సింహ మాట్లాడారు. దశాబ్ద కాలం మీ కుటుంబ పాలనలో ఏనాడు కూడా విద్యార్థి నిరుద్యోగుల గురించి మాట్లాడకుండా వారి సంక్షేమం పట్టించుకోకుండా, తెలంగాణ స్వరాష్ట్రం కోసం సర్వస్వం ధారబోసిన వేలాదిమంది విద్యార్థి నిరుద్యోగుల జీవితాలను ఆగం చేసి ఈరోజు నకిలీ ప్రేమ వలకబోస్తే ఎవ్వరు నమ్మరు అని మండిపడ్డారు.