రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిన తీరు సరిగా లేదు

76చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిన తీరు సరిగా లేదని ఆరోపిస్తూ తెలంగాణ మాల విద్యార్థి జేఏసీ మాదాసు రాహుల్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వర్గీకరణ వల్ల మాలలు నష్టపోయారని మండిపడ్డారు. నిన్నటి రోజు ఫిబ్రవరి 4 2025 ను మాలలు అందరూ బ్లాక్ డే గా ప్రకటిస్తున్నామని అన్నారు. మాలల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి రోజు నింపిందని మండిపడ్డారు. మాలలు అందరూ ఇప్పటికైనా మేలుకోవాలని ఏ రాజకీయ పార్టీ మనకు అండగాలేదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్