తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. కామారెడ్డి, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షపు జల్లులు పడనున్నట్లు తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, బుధవారం పలు జిల్లాల్లో ఆకాల వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.