తన దర్శకత్వంలో వచ్చిన ‘థగ్ లైఫ్’ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిందన్నారు మణిరత్నం. ఈ విషయంలో ఆడియన్స్కు క్షమాపణలు చెప్పారు. ‘ మా ఇద్దరి నుంచి మరో ‘నాయకుడు’ను ఆశించి వారికి నేను చెప్పగలిగేది క్షమాపణలు మాత్రమే. మేము అందించిన దాని కంటే ఆడియన్స్ భిన్నంగా కోరుకున్నారని అర్థం చేసుకున్నా’ అని మణిరత్నం అన్నారు. కాగా ప్రస్తుతం ఆయన తన తర్వాత సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.