ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో భారత పేసర్ ఆకాశ్ దీప్ 10 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ అనంతరం ఆకాశ్ మాట్లాడుతూ.. తన ప్రదర్శనను క్యాన్సర్తో బాధపడుతున్న సోదరికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు. "నా సోదరికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. నేను ఆమె చిరునవ్వును చూడాలనుకుంటున్నాను. నేను బౌలింగ్ చేయడానికి పరిగెత్తిన ప్రతిసారీ ఆమె ముఖాన్ని నా మనస్సులో చూసుకున్నాను" అని ఆకాశ్ దీప్ పేర్కొన్నాడు.