ఇంగ్లండ్తో జరగనున్న టెస్ట్ సిరీస్తో కరుణ్ నాయర్ పునరాగమనం చేయనున్నాడు. దేశవాళీలో సత్తాచాటి ఏడేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో కరుణ్ గురించి కేఎల్ రాహుల్ మాట్లాడాడు.'కరుణ్ యూకేలో చాలా నెలలపాటు కౌంటీ క్రికెట్ ఆడాడు. ఎన్నో కష్టాలన్నింటినీ అనుభవించి తిరిగి భారత జట్టులోకి రాగలిగాడు. ఇది అతనికి, తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. అతని ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకం' అని రాహుల్ పేర్కొన్నాడు.