మోదీ అనుమతిస్తే ఆత్మాహుతి బాంబర్ అవుతా: మంత్రి

75చూసినవారు
మోదీ అనుమతిస్తే ఆత్మాహుతి బాంబర్ అవుతా: మంత్రి
భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం తనను తాను త్యాగం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రధాని మోదీ అనుమతిస్తే.. తాను పాకిస్తాన్‌పై ఆత్మాహుతి దాడికి రెడీ అని ప్రకటించారు. అయితే గతంలోనే జమీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.