నూతన జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రంపై ఎంఎన్ఎం పార్టీ అధినేత, నటుడు కమల్హాసన్ స్పందించారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ, తమిళనాడు సహా పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లకు అండగా ఉంటానని చెప్పారు. భాష విద్యకు సహాయకంగా ఉండాలే తప్పా.. బలవంతంగా రుద్దకూడదని పేర్కొన్నారు. అంతర్జాతీయ భవిష్యత్ అవకాశాల కోసం ఆంగ్లం, స్పానిష్, చైనీస్ వంటి భాషలను నేర్చుకోవచ్చన్నారు.