పాకిస్థాన్తో ఉద్రిక్త పరిస్థితుల మధ్య యుద్ధ భయంతో దేశవ్యాప్తంగా జరగాల్సిన CA పరీక్షలను వాయిదా వేసినట్లు ICAI ప్రకటించింది. మే 14 వరకు జరగాల్సిన ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని తెలిపింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు పరిస్థితి దృష్ట్యా వచ్చే మూడు రోజులు అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది.