పహల్గామ్లో పర్యాటకులపై టెర్రరిస్టుల దాడి అనంతరం.. ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ విచక్షణా రహితంగా భారత పౌరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. పాక్ దాడులను భారతసైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఛైర్మన్ జై షా భారత సైనికులకు సంఘీభావం తెలిపారు. వారి కృషి, ధైర్యసాహసాలను గురించి తన ఇన్స్టా స్టోరీలో ప్రస్తావించారు.