ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్ విచక్షణా రహితంగా భారత పౌరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. వీటిని భారతసైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది.
ఈ నేపథ్యంలో ఐసీసీ ఛైర్మన్ జై షా భారత సైనికులకు సంఘీభావం తెలిపారు. వారి కృషి, ధైర్యసాహసాలను తన ఇన్స్టా స్టోరీలో ప్రస్తావించారు.