ఐపీఎల్ 2025లో 12 లీగ్ మ్యాచ్లు, 2 క్వాలిఫయర్స్, 1 ఎలిమినేటర్, ఫైనల్ (మే 25, కోల్కతా) మ్యాచ్లు నిర్వహించాలి. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ కారణంగా షెడ్యూల్ మార్చలేని ఐసీసీ, వర్షాకాలంలో మ్యాచ్లకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని భావిస్తోంది. దీంతో, మిగిలిన మ్యాచ్లను విదేశాల్లో గాని, సెప్టెంబర్ నెలలో గాని నిర్వహించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ భద్రతా కారణాలతో రద్దయిన విషయం తెలిసిందే.