టీ20 వరల్డ్ కప్-2024కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ, టోర్నీలో ఎక్కువ మ్యాచ్లు అమెరికాలోనే నిర్వహించారు. అయితే మ్యాచ్లను ఎక్కువగా యూఎస్ఏలో నిర్వహించటం వల్ల ఐసీసీకి రూ.167 కోట్ల నష్టం వచ్చినట్లు సమాచారం. రేపు కొలంబోలో జరిగే ఐసీసీ వార్షిక సదస్సులో ఈ అంశంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. తక్కువ టికెట్ల అమ్మకం, అధిక నిర్వహణ ఖర్చుల వల్ల నష్టాలు వచ్చినట్లు సమాచారం.